HYD: హెబ్రోన్ చర్చ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-12-03T17:07:24+05:30 IST

హెబ్రోన్ చర్చ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

HYD: హెబ్రోన్ చర్చ్ వద్ద  కొనసాగుతున్న ఉద్రిక్తత

హైదరాబాద్: హెబ్రోన్ చర్చ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ట్రస్ట్ సభ్యులు ఆందోళనకు దిగగా... సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. ఇరు సభ్యుల మధ్య తోపులాట జరిగింది. కోర్ట్ తీర్పును అమలు చేయాలని ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సొసైటీ సభ్యులు చర్చ్‌కు తాళాలు వేశారు. దీంతో తాళాలు పగులగొట్టెందుకు  ట్రస్ట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2021-12-03T17:07:24+05:30 IST