తొమ్మిదవ రోజుకు చేరుకున్న లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-20T12:53:51+05:30 IST
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తొమ్మిదవ రోజుకు చేరుకుంది.

హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తొమ్మిదవ రోజుకు చేరుకుంది. మినహాయింపు సమయాల్లో ఈరోజు కూడా రోడ్ల మీద భారీగా వాహనాలు తిరుగుతున్నాయి. నేటి నుంచి లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీస్శాఖ స్పష్టం చేసింది. విచ్చలవిడిగా వాహనాలు రోడ్లపై రావడంపై నిన్న డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 10 తర్వాత రోడ్లకి వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేయాలని, ఆధారాలు లేకుంటే కేసులు నమోదు చేసి....వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.