Hyderabad జంట పేలుళ్లకు 14 ఏళ్ళు పూర్తి

ABN , First Publish Date - 2021-08-25T14:07:54+05:30 IST

నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల విషాదానికి నేటితో 14ఏళ్లు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్‌లో జంట పేలుళ్లు జరిగాయి.

Hyderabad జంట పేలుళ్లకు 14 ఏళ్ళు పూర్తి

హైదరాబాద్: నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల విషాదానికి నేటితో 14ఏళ్లు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్‌లో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా.... వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 14 ఏళ్ళు అయిన రక్త మరకలు ఇంకా మారలేదు.ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ జంట పేలుళ్లకు కుట్ర పన్నింద. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు  చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షకు ఖరారు చేసింది. A-1 అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయించిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషాదం జరిగి 14 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు బాధితులకు సాయం అందని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2021-08-25T14:07:54+05:30 IST