లోన్యాప్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ABN , First Publish Date - 2021-06-18T15:00:07+05:30 IST
లోన్యాప్ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్: లోన్యాప్ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఖాతాల నుంచి అక్రమంగా నగదు బదిలీకి సంబంధించి కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. సైబర్ నేరస్థుడు అనిల్తో రూ.25లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి కోల్కతా వెళ్లేందుకు అనిల్ ఖాతాలో రూ.20వేలను రుణయాప్ నిర్వాహకులు జమ చేశారు. నకిలీ ఎస్సై అవతారమెత్తి కోల్కతా ఐసీఐసీఐ ఖాతాలో నుంచి రూ.1.18కోట్లు బదిలీ చేసిన అనిల్...నగదును ఆనంద్ ఖాతాలో జమ చేసి ఆ తర్వాత పలు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఇందుకోసం ఆనంద్కు అనిల్ రూ.1.5లక్షలు ఇచ్చాడు. అనిల్కు సూచనలిచ్చిన వ్యక్తి కోసం సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీ వెళ్లారు.