విద్యుత్తీగలు తగలి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం
ABN , First Publish Date - 2021-05-05T17:11:07+05:30 IST
నగరంలోని ఉప్పల్ మాడ్రన్ బ్రెడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మాడ్రన్ బ్రెడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ తీగలకు కంటైనర్ తగలడంతో ఇద్దరు డ్రైవర్లు సజీవదహనమయ్యారు. కంటైనర్లో ఉన్న కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులు సెహ్జడ్(38), గంగా సాగర్(50)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.