బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో ఈటల భేటీ

ABN , First Publish Date - 2021-05-12T16:11:00+05:30 IST

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఉదయం సమావేశమయ్యాయి.

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో ఈటల భేటీ

హైదరాబాద్:  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఉదయం సమావేశమయ్యారు.  తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించనట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లిన ఈటల గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను సైతం ఈటల కలిశారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్‌తో ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2021-05-12T16:11:00+05:30 IST