సెప్టెంబర్ 30 వరకు జాతీయ పోషణ మాసం

ABN , First Publish Date - 2021-09-04T02:37:08+05:30 IST

హైదరాబాద్: భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జాతీయ పోషణ మాసం నిర్వహిస్తోంది.

సెప్టెంబర్ 30 వరకు జాతీయ పోషణ మాసం

హైదరాబాద్: భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జాతీయ పోషణ మాసం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంస్థ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ దీపక్ శర్మ మాట్లాడుతూ, సంతులిత ఆహారం సమగ్ర జీవన విధానాలు ప్రోత్సహించే క్రమంలో భాగంగా భారత ప్రభుత్వం పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇందులో భాగంగా పోషన్ మాసం మరియు పోషణ పక్షోత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం పోషణ మాసాన్ని పోషణ యోగా, పోషకాహార మొక్కలు, కిట్ల పంపిణీ వంటి థీమ్‌లుగా విభజించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులందరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంస్థ డీజీఎంలు ఘన్‌‌శ్యామ్, కమలాకర్, సుధాకర్ రావు, కిరణ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T02:37:08+05:30 IST