డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు: మొద్దు లచ్చిరెడ్ది
ABN , First Publish Date - 2021-07-24T06:40:42+05:30 IST
గౌతమినగర్ కాలనీకి ప్రత్యేక నిధులు కేటాయించి డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చూస్తామని బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు.
వనస్థలిపురం, జూలై 23(ఆంధ్రజ్యోతి): గౌతమినగర్ కాలనీకి ప్రత్యేక నిధులు కేటాయించి డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చూస్తామని బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం బాలాజీనగర్, గౌతమినగర్ కాలనీల్లో ఆయన పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. గల్ఫర్ వాహనాలతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో ఏఈ గౌతమ్రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి, రమణమూర్తి, సాయి, సత్యనారాయణ, జవాన్ లక్ష్మయ్య పాల్గొన్నారు.
వరద నీటి కాలువ నిర్మాణానికి కృషి: సుజాతానాయక్
చంపాపేట, జూలై 23 (ఆంధ్రజ్యోతి): హస్తినాపురం డివిజన్లోని దేవకీఎన్క్లేవ్, వెంకటేశ్వరకాలనీల మధ్య వరద నీటి కాలువ నిర్మాణానికి కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ సుజాతానాయక్ చెప్పారు. శుక్రవారం కార్పొరేటర్ ఆయా కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ప్లాట్ యజమానితో మాట్లాడనున్నట్లు తెలిపారు. అదే విధంగా శివసాయికాలనీలో వరద నీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ హేమునాయక్, కాలనీవాసులు గోపీరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మారం శ్రీధర్, సాయినాథ్, గోవర్ధన్రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.