బావమరిదే కదా అని నమ్మితే భారీ మోసం!

ABN , First Publish Date - 2021-05-21T13:44:22+05:30 IST

వాట్సాప్‌లో విషయం గమనించిన లక్ష్మినారాయణ తన బావమరిదికి ఫోన్‌ చేశాడు...

బావమరిదే కదా అని నమ్మితే భారీ మోసం!

  • బాలానగర్‌లో మరో సైబర్‌ మోసం
  • రూ. లక్షా 50వేలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు 

హైదరాబాద్/బాలానగర్‌ : ఆన్‌లైన్‌ మోసాలకు అమాయకులెందరో ఇంకా బలవుతూనే ఉన్నారు. తాజాగా బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడు ఏకంగా రూ. లక్షా 50 వేలను నష్టపోవడం గమనార్హం. బాలానగర్‌ సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఐడీపీఎల్‌ కాలనీ ఎదురుగా ఉన్న ఇందిరానగర్‌లోని ఇందిరా పోర్జ్‌లో నివాసముంటున్న రిటైర్డు ఉద్యోగి కర్ర వెంకటలక్ష్మినారాయణ(71)కు ఈ నెల 17న  అతని బావమరిది నుంచి వాట్సా్‌పకు మెసేజ్‌ వచ్చింది. తనకు అర్జంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని మెసేజ్‌ సారాంశం.


వాట్సాప్‌లో విషయం గమనించిన లక్ష్మినారాయణ తన బావమరిదికి ఫోన్‌ చేశాడు. బిజీగా ఉన్నానని, అకౌంట్‌ నెంబరు వివరాలు చెప్పాడు. దీంతో బావమరిదే కదా అని నమ్మి మొదట లక్ష, తరువాత రూ.50 వేలు అకౌంట్‌లో వేశాడు. కాసేపటి తరువాత తన తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా బావమరిదికి ఫోన్‌ చేయగా తన బావమరిది వాట్సాప్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని తేలడంతో మోసపోయానని గమనించాడు. బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ యం.డి.వహిదుద్దీన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-21T13:44:22+05:30 IST