బాలికను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు
ABN , First Publish Date - 2021-03-05T07:07:52+05:30 IST
తొమ్మిదేళ్ల క్రితం బాలికను వేధించిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
సనత్నగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదేళ్ల క్రితం బాలికను వేధించిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్నగర్లో ఇంట్లో వంట చేసేందుకు ఓ వ్యక్తి(40) 2012లో పనిలో చేరాడు. ఏడాది పాటు అక్కడ పనిచేశాడు. పనిచేస్తున్న సమయంలో ఆ ఇంట్లో ఉన్న బాలిక(11)ను వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.