హాస్టల్లో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-01-18T06:12:44+05:30 IST
మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు.
అమీర్పేట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఎస్ఆర్నగర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాకు చెందిన మస్తాన్ వారం రోజుల క్రితం నగరానికి వచ్చాడు. సినీ కార్మికుడిగా పనిచేస్తూ బాపూనగర్ గణేష్ హాస్టల్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు. శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో స్థానికంగాగల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నా ఉపయోగం లేదు. ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.