CM KCR ఫొటో మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్..
ABN , First Publish Date - 2021-12-01T17:38:45+05:30 IST
సీఎం కేసీఆర్ ఫొటో మార్పింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్కు చెందిన కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్
ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్/బంజారాహిల్స్: సీఎం కేసీఆర్ ఫొటో మార్పింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్కు చెందిన కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడు. ఇది తన మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని, కేసీఆర్పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ యూసు్ఫగూడకు చెందిన సాల్మన్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.