తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2021-04-26T15:38:07+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సంప్రదాయ సంస్కారాన్ని ఆధునిక విలువలను మేళవించి పద్యాన్ని వచన కవితను సమ ఉజ్జీగా పండించిన తిరునగరి కవితా ధార గొప్పదని సీఎం అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరించుకున్నారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.