Charminar: ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-14T14:48:18+05:30 IST
పాతబస్తీలో పార్కింగ్ చేసి న బైక్లను దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం మొఘల్పురా పోలీస్టేషన్ ఆవరణలో విలేకరు ల సమావేశంలో
హైదరాబాద్/చార్మినార్: పాతబస్తీలో పార్కింగ్ చేసి న బైక్లను దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం మొఘల్పురా పోలీస్టేషన్ ఆవరణలో విలేకరు ల సమావేశంలో సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ రఫిక్, ఇన్స్పెక్టర్ రవికుమార్ వివరాలను వెల్లడించారు. కొత్తపేట్ బిస్మిల్లాహ్ కాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ షాహిద్(24), పాతబస్తీ తలాబ్కట్టకు చెందిన మహ్మద్ సుల్తాన్(24) స్నేహితులు. వీరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి రూ.3.80 లక్షల విలువచేసే 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.