సేవలోనూ రాజకీయమా?

ABN , First Publish Date - 2021-04-12T06:50:59+05:30 IST

యిన్‌పల్లి మార్కెట్‌ యార్డు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం కూల్చివేయడం విమర్శలకు తావిస్తోంది.

సేవలోనూ రాజకీయమా?
కూల్చివేసిన చలివేంద్రం

బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డు వద్ద చలివేంద్రం కూల్చివేత

కంటోన్మెంట్‌లో టీఆర్‌ఎ్‌సలో బహిర్గతమైన విభేదాలు

బోయిన్‌పల్లి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం కూల్చివేయడం విమర్శలకు తావిస్తోంది. వేసవి కాలం కావడంతో మార్కెట్‌కు వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు  టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీగణేష్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అదే పార్టీకి  చెందిన కొందరు కూల్చివేశారు. కంటోన్మెంట్‌లో టీఆర్‌ఎ్‌సలో నాలుగు వర్గాలు ఉన్నాయి, ఈ ఘటనతో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన చలి వేంద్రం ఫ్లెక్సీలలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫొటోలు లేనందునే చలివేంద్రాన్ని కూల్చివేసి ఉంటారని టీఆర్‌ఎ్‌సలోని మరో వర్గం సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టింది.


Updated Date - 2021-04-12T06:50:59+05:30 IST