సాంస్కృతికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-08T18:08:55+05:30 IST
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం శాస్త్రి భవన్ మంత్రిత్వశాఖ కార్యాలయం పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. కిషన్రెడ్డితో పాటు మీనాక్షి లేఖి, అర్జున్ రామ్ మేఘవాల్ సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రిగా కిషన్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. మరికాసేపట్లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతులు చేపట్టబోతున్నారు.