తెలంగాణ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-08T00:23:55+05:30 IST
తెలంగాణ ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీతో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కుమార్,...
![తెలంగాణ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీతో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కుమార్, మున్సిపల్ శాఖ అదనపు కార్యదర్శి సుదర్శన్ కుమార్లకు హెచ్చరించాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుతూ మునిసిపల్ శాఖ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వెనక్కి తీసుకుంది.