Hyderabad లో మరో భారీ మోసం.. కోట్లకు టోకరా..!
ABN , First Publish Date - 2021-12-07T15:08:14+05:30 IST
Hyderabad లో మరో భారీ మోసం.. కోట్లకు టోకరా..!
- ప్రాజెక్టు డైరెక్టర్నంటూ మోసం.. అరెస్ట్
హైదరాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ పథకానికి అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్నంటూ పలువురిని మోసం చేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన కె.గురుప్రసాద్ తనను తాను అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్గా పరిచయం చేసుకున్నాడు. ప్రాజెక్టు ద్వారా రుణాలు ఇప్పిస్తానని 30 మంది వద్ద అడ్వాన్సుగా డబ్బులు తీసుకున్నాడు. చెల్లించిన డబ్బుకు రెట్టింపు లాభాలిస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన వారు రూ. 3లక్షల నుంచి రూ. 10లక్షల వరకు చెల్లించారు. ఇలా రూ. 2.5కోట్లు సేకరించిన గురుప్రసాద్ ఆ తర్వాత తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుల్లో ఒకరైన కె. రమేశ్ కొన్ని రోజుల క్రితం సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అతన్ని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం కోర్టుకు తరలించారు.