ఉత్తమ సంతానానికి మార్గదర్శి రామకృష్ణ మఠం ఆర్యజనని
ABN , First Publish Date - 2021-08-04T01:33:03+05:30 IST
రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆర్యజనని కార్యక్రమం చేపట్టారు. ఉత్తమ బిడ్డకు జన్మనివ్వడానికి అవకాశం కల్పించేలా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆర్యజనని కార్యక్రమం చేపట్టారు. ఉత్తమ బిడ్డకు జన్మనివ్వడానికి అవకాశం కల్పించేలా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఉత్తమమైన భవిష్యత్ తరాలను తయారు చేసే లక్ష్యంతో ఆర్యజనని వర్క్ షాప్లు నిర్వహిస్తోంది. ఆర్యజనని టీమ్లో డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా ఉన్నారు. ఆగస్ట్ 7వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా జరగనుంది. ఇందులో భాగంగా తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వర్క్ షాప్లో ధ్యానం, భజనలు, యోగాసనాలు ఇతర విషయాలు నేర్పిస్తారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను ఉపదేశిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం www.aaryajanani.org వెబ్సైట్ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.
శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ, సంస్కారమే.. ఆ శిశువు మంచి వ్యక్తిగా ఎదగడానికి గానీ చెడు వ్యక్తిగా ఎదగటానికి గానీ కారణభూతమవుతుందని ఆర్యజనని బృందం చెబుతోంది. సంస్కారవంతులైన, దైవం పట్ల భక్తి, శ్రద్ధలు కలిగిన తల్లులకు ఉన్నతమైన వారు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పిన మాటల స్ఫూర్తితో ఆర్యజనని కార్యక్రమం రూపుదిద్దుకుంది. శిశువు జననానికి సంబంధించిన ఆధునిక విజ్ఞానం ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు.