నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-27T04:42:17+05:30 IST

ఉద్యోగాల భర్తీ కోసం పార్టీ రాష్ట్ర అధినేత బం డి సంజయ్‌ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించే నిరుద్యో గ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌ రావుపటేల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక దారాబ్జీ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో పార్టీ ప్రతినిధులతో, విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎ న్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ తమకు కుటుంబానికి, బందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ని రుద్యోగులకు మొండిచేయి చూపుతున్నారని ఆరోపించారు. మోస పూరిత ప్రకటనలు తప్పుడు వాగ్ధానాలతో కాలపయన చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గుణపాఠం చెప్పా ల్సిన సమయం ఆసన్నమయిందన్నారు.

నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలి

భైంసా, డిసెంబరు 26 : ఉద్యోగాల భర్తీ కోసం పార్టీ రాష్ట్ర అధినేత బం డి సంజయ్‌ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించే నిరుద్యో గ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌ రావుపటేల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక దారాబ్జీ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో పార్టీ ప్రతినిధులతో, విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎ న్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ తమకు కుటుంబానికి, బందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ని రుద్యోగులకు మొండిచేయి చూపుతున్నారని ఆరోపించారు. మోస పూరిత ప్రకటనలు తప్పుడు వాగ్ధానాలతో కాలపయన చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గుణపాఠం చెప్పా ల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ముథోల్‌ నిరుద్యోగ యువత తమ సత్తాను చాటుకునేందుకు నిరుద్యోగ దీక్షకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజ యవంతం చేయాలని విజ్ఙప్తి చేశారు. సమావేశంలో డి.శ్రీనివాస్‌, మాణిక్‌ దగ్డే, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:42:17+05:30 IST