అగ్నిప్రమాదంలో బాధితులకు వ్యాపారుల చేయూత
ABN , First Publish Date - 2021-07-31T07:10:53+05:30 IST
మండల కేంద్రానికి చెందిన గుర్రం పోసులు, గుర్రం రవిల ఇళ్లు గురువారం దగ్ధమైన విషయం తెలిసిందే.
లక్ష్మణచాంద, జూలై 30 : మండల కేంద్రానికి చెందిన గుర్రం పోసులు, గుర్రం రవిల ఇళ్లు గురువారం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నగదుతో పాటు నిత్యా వసర వస్తువులన్నీ తగలబడిపోయాయి. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గం నిర్మల్కు చెందిన స్టీల్మర్చంట్ అసోసియేషన్, సూర్యక్లాత్ మర్చంట్, ఎస్డీబీ క్లాత్ మర్చంట్ సహకారంతో వంటసామాగ్రి, బట్టలు, నిత్యావసర స రుకులైన బియ్యం, ఆయిల్, పప్పు దినుసులు తదితరాలను బాధిత రెండు కుటుంబా లకు అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న కాంగ్రెస్ నాయకులను, అందుకు సహకరించిన వారిని పలువురు అభినందించారు. చేయూతనిచ్చినందుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బన్నెబోయిన పోశెట్టి, కాంగ్రెస్ యువజన మండల అధ్యక్షుడు గాండ్ల చిన్నయ్య, ఎంపీటీసీలు గడ్డం నర్సారెడ్డి, తిప్పని రాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ ఒడ్నాల రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ ఓస రాజు, కాంగ్రెస్ నాయకులు అట్ల చిన్న రాంరెడ్డి, వేణు గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.