పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2021-05-21T04:34:09+05:30 IST
కరోనా పరిస్థితుల్లో రెండే ళ్లుగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభి నందనీయమని సీఐ బాబూరావు అన్నారు. అభినవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఐబీలో నిర్వహించిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను సంస్థ ఆధ్వర్యంలో సన్మానించి, శానిటైజర్లు, మాస్కు లు పంపిణీ చేశారు.

తాండూర్, మే 20: కరోనా పరిస్థితుల్లో రెండే ళ్లుగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభి నందనీయమని సీఐ బాబూరావు అన్నారు. అభినవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఐబీలో నిర్వహించిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను సంస్థ ఆధ్వర్యంలో సన్మానించి, శానిటైజర్లు, మాస్కు లు పంపిణీ చేశారు. గురువారం సంస్థ ఆధ్వర్యంలో పీహెచ్సీలో పాజిటివ్ వచ్చిన వారికి డ్రైఫ్రూట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. పీఎస్సై రవి కుమార్, ఏఎస్సై రాజన్న, సంస్థ అధ్యక్షుడు సంతోష్ కుమార్, ప్రతినిధులు రాజ్కిరణ్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలి
మందమర్రి: కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రమ వుతున్న దృష్యా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రామకృష్ణాపూర్ సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకపోవడంతోనే కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిం దన్నారు. కరోనాతో మృతి చెందిన ప్రతీ కుటుంబా నికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనావాస్, మిట్టపల్లి పౌల్, సత్యనారాయణ, రమేష్ ఉన్నారు.
కార్మికులకు శానిటైజర్ల అందజేత
ఏసీసీ : పట్టణంలోని 15వ వార్డు బీజేపీ నాయకుడు ఆకుల సంతోష్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు గురువారం ఫేస్ షీల్డ్, శానిటైజర్లను జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అందజేశారు. పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ఆకుల సంతోష్, సాతి ని రాజు, నాగరాజు, అన్వేష్, పట్టి వెంకట రవణ, జాడి సత్యనారాయణ, పల్లి రాకేష్ పాల్గొన్నారు.