జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి
ABN , First Publish Date - 2021-11-21T06:09:47+05:30 IST
ఒకపక్క ధనిక రాష్ట్రమని చెబుతు రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జైలు కు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రో ల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి
ఆదిలాబాద్ టౌన్, నవంబరు 20: ఒకపక్క ధనిక రాష్ట్రమని చెబుతు రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జైలు కు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రో ల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించి సామాన్యుడిపై కొంత భారాన్ని తగ్గించిన ప్రజా వ్యతిరేక నినాదాలకు పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు వ్యాట్ను తగ్గించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ తనమొండి వైఖరితో వ్యాట్ను తగ్గించేది లేదని సీఎం కేసీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో జిల్లా ఇన్చార్జీ అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్, రాష్ట్ర మహిళ నాయకురాలు సుహాసినీరెడ్డి, నాయకులు లోక ప్రవీన్రెడ్డి, రత్నాకర్రెడ్డి, ఆదినాథ్, నాంపెల్లి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.