రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-25T04:16:26+05:30 IST
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం మండ లంలోని ఐనం-పోలంపల్లి గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు.
- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
దహెగాం, అక్టోబరు 24: మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం మండ లంలోని ఐనం-పోలంపల్లి గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహ దారి నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.2.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మారు మూల గ్రామాలకు రోడ్డు నిర్మాణంతో రవాణా పరంగా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుం దన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరామారావు, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ సంతోష్గౌడ్, ఆత్మ చైర్మన్ కొమురగౌడ్, సర్పంచ్లు జయేందర్, కృష్ణ, ఎంపీటీసీ శంకర్, నాయుకలు ప్రసాద్రాజు, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
చింతలమానేపల్లి: మండలంలోని బాబాసాగర్ గ్రామంలో ఆదివారం డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కోనరుకోనప్ప ఆవిష్కరించారు. కార్యక్ర మంలో ఎంపీపీ నానయ్య, నాయకులు నాజీం హుస్సేన్, జడ్పీటీసీ శ్రీదేవి, సర్పంచ్ సుశీల, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.