రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
ABN , First Publish Date - 2021-10-24T04:25:22+05:30 IST
జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల క్రీడాకారులు ఈనెల31 నుంచి ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 23: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల క్రీడాకారులు ఈనెల31 నుంచి ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సంద ర్భంగా విద్యార్థులను జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకురాలు మణెమ్మ, ఏసీఎంవో ఉద్దవ్, శకుంతల, ఏటీడీవో క్షేత్రయ్య, ప్రధానోపాధ్యాయుడు శంకర్, మౌనిక, పీడీ మధుసూదన్, పీఈటీ విద్యాసాగర్ అభినందించారు.