ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-21T03:56:42+05:30 IST

కాజీపల్లి 181 సర్వే నంబరులోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ దశరథ హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు



















జిన్నారం, అక్టోబరు 20: కాజీపల్లి 181 సర్వే నంబరులోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ దశరథ హెచ్చరించారు. స్థానిక భూముల్లో మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఆక్రమణదారులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుతో బుధవారం తహసీల్దార్‌ ఆదేశాలతో ఆర్‌ఐ సునీల్‌నాయక్‌ పర్యటించారు. ఆక్రమణలకు గురైన భూముల వద్ద ప్రభు త్వ భూమి పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. సదరు భూములపై విచారణ జరిపి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2021-10-21T03:56:42+05:30 IST