కరోనాతో ఆరుగురి మృతి!!

ABN , First Publish Date - 2021-04-11T07:09:50+05:30 IST

కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న క్రమంలో జిల్లాలో శనివారం ఆరుగురు మహమ్మారి బారిన పడి మృతి చెందారు. వీరిలో ఆదిలాబాద్‌లోని న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఒకరు, తలమడుగు మండలంలోని సాయిలింగికి చెందిన వారు ఒకరు, జైనథ్‌ మండలంలోని ఆనంద్‌పూర్‌, బజార్‌హత్నూ

కరోనాతో ఆరుగురి మృతి!!

ఆదిలాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 10: కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న క్రమంలో జిల్లాలో శనివారం ఆరుగురు మహమ్మారి బారిన పడి మృతి చెందారు. వీరిలో ఆదిలాబాద్‌లోని న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఒకరు, తలమడుగు మండలంలోని సాయిలింగికి చెందిన వారు ఒకరు, జైనథ్‌ మండలంలోని ఆనంద్‌పూర్‌, బజార్‌హత్నూర్‌ మండలంలో ఒకరు, బోథ్‌ మండలంలో ఒకరు, ఉట్నూర్‌లో ఒకరి చొప్పున మృతి చెందారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఒక్క రోజులోనే ఆరుగురు మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు ఇప్పటికైనా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జిల్లా ఉన్నతాధికారులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 59కి చేరింది. 

Updated Date - 2021-04-11T07:09:50+05:30 IST