గూడెం గుట్టపై కమనీయంగా సత్యదేవుడి కల్యాణం
ABN , First Publish Date - 2021-02-25T04:13:43+05:30 IST
దండేపల్లి మండలం గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి పుణ్యక్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గోధూళిక సముహురమున సత్యదేవుడి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు
పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు
దండేపల్లి, ఫిబ్రవరి 24: దండేపల్లి మండలం గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి పుణ్యక్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గోధూళిక సముహురమున సత్యదేవుడి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి కల్యాణం తిలకించారు. ముందుగా గుట్ల కింద నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని సన్నాయి వాయిద్యాలతో ప్రధానలయం వరకు తీసుకు వచ్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్ధానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దంపతులు, ఆయన తనయుడు విజీత్రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు రఘస్వామి, ఆలయ ఈవో వడ్లూరి అనూష, భక్తులు సమర్పించారు. స్వామి వారికి పుష్పలంకరణ చేసిన అనంతరం కల్యాణ వేదిక వరకు మేళ తలాలతో తీసుకువచ్చి సత్యదేవుడి విగ్రహమూర్తులను ప్రతిప్ఠించారు. అనంతరం వేదపండితుల అభిరామచార్యులు మంత్రోచ్ఛరణ నడుమ ఆలయ ముఖ్య అర్చకులు గోవర్ధన రఘస్వామి, అర్చకులు సంపత్స్వామి, వేదపండితులు దుద్దిళ్ల నారాయణశర్మ సమక్ష్యంలో స్వామి వారికి కంకణదారణ, యజోపవీతదారణ, జీలకర్రబెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ చేపట్టారు. దేవస్ధానం ఆధ్వర్యంలో భక్తులకు తీర్ధప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.