పగిలిన పైప్లైన్
ABN , First Publish Date - 2021-04-14T04:46:18+05:30 IST
క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో విద్యుత్ స్థంభాల ఏర్పాటులో చేస్తున్న జెసీబీ పను లలో మంచినీటి పైప్లైన్ పగిలి నీరు వృధాపోయింది.
మందమర్రి, ఏప్రిల్ 13: క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో విద్యుత్ స్థంభాల ఏర్పాటులో చేస్తున్న జెసీబీ పను లలో మంచినీటి పైప్లైన్ పగిలి నీరు వృధాపోయింది. వారం రోజుల నుంచిఅక్కడ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం రోజున జేసీ బీతో చేస్తున్న క్రమంలో మిషన్ భగీరఽథ పైప్లైన్కు తగిలి నీరు అంతా సుమారు నాలుగు గంటల పాటు వృధా పోవడంతో అక్కడ కాలనీ అం తా నీటి మయం అయ్యింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడం గమనార్హం. అస్సలే వేసవికాలం కావడంతో ఈ ప నులు ఎప్పుడు పూర్తవుతాయని పలువురు ఆగ్రహం చెందుతు న్నారు.