కాసేపట్లో ఆదిలాబాద్కు ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN , First Publish Date - 2021-02-26T13:27:02+05:30 IST
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరికాసేపట్లో జిల్లాకు రానున్నారు. గత రాత్రి నిర్మిల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్ బస చేశారు.
ఆదిలాబాద్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరికాసేపట్లో జిల్లాకు రానున్నారు. గత రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్ బస చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఆదిలాబాద్లో పర్యటించనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గుడిహత్నూర్ మండలం లింగాపూర్లో సేంద్రీయ రైతు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో 15వందల రైతు కుటుంబాలకు ఆహ్వానం అందింది. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.