ఘనంగా ‘గణతంత్ర’ వేడుకలు
ABN , First Publish Date - 2021-01-27T05:17:46+05:30 IST
నిర్మల్ జిల్లాలో 72వ గణతం త్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.
నిర్మల్ జిల్లాలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
నిర్మల్టౌన్, జనవరి 26: నిర్మల్ జిల్లాలో 72వ గణతం త్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్లో బాలాజీ సంఘ భవనంలో జెండాను గౌరవ అధ్యక్షుడు అప్పాల ప్రభాకర్ పతాకావిష్కరణ చేశారు. అలాగే, పట్టణంలోని మున్నూరు కాపు మిత్ర మండలి ఆధ్వర్యంలో అధ్యక్షుడు పుప్పాల రమేష్ జెండాను ఆవిష్కరించారు.
నిర్మల్ రూరల్: మండలంలోని మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఇందులో ఎంపీపీ రాంరెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, ఎంపీడీవో సాయిరాం పాల్గొన్నారు. గ్రామాల్లోనూ జెండాలను ఎగురవేశారు.
ఖానాపూర్ రూరల్: మండలంలోని సింగాపూర్, రాజూర, బావాపూర్ (ఆర్), తర్లపాడ్, బీర్నంది, సుర్జాపూర్, బాదనకుర్తి, గోసంపల్లె, పాత ఎల్లాపూర్, కొత్తపేట్, బావాపూర్ (కె), ఎర్వచింతల్, అడవి సారంగాపూర్, చందునాయక్ తండా తదితర గ్రామాల్లో మువ్వన్నెల జెండా రెపరెప లాడింది.
సోన్: మండలంలోని ఆయా గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.
నర్సాపూర్(జి): మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
భైంసా రూరల్: మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బుధవారం 72వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.
దిలావర్పూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
దస్తూరాబాద్: మండలకేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కడెం: మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సారంగాపూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.
లక్ష్మణచాంద: 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం మండలంలో ఘనంగా నిర్వహించారు.
పెంబి: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణతంత్ర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
కుభీర్: మండల కేంద్రంతో పాటు మండలంలోని పార్డి(బి), పల్సి, నిగ్వా, సొనారి తదితర గ్రామాల్లో మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ముథోల్తో పాటు, తానూర్, కుంటాల, లోకేశ్వరం మండలాల్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.