వేతనాలు పెంచాలని వినతి

ABN , First Publish Date - 2021-01-13T04:32:11+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషంట్‌ కేర్‌ ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.21 వేలకు పెంచాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్వామికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.

వేతనాలు పెంచాలని వినతి
వినతిపత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఆసిఫాబాద్‌, జనవరి 12: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషంట్‌ కేర్‌ ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.21 వేలకు పెంచాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్వామికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దివాకర్‌, చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T04:32:11+05:30 IST