నేటి నుంచి పూసాయి ఎల్లమ్మ జాతర
ABN , First Publish Date - 2021-01-13T06:16:19+05:30 IST
మండలంలోని పూసాయి గ్రామంలో అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ(దుర్గామాత) ఆలయ ఆవరణలో బుధవారం నుంచి నెలరోజుల పాటు జాతర ప్రారంభం కానున్నట్లు గ్రామ కమిటీ నిర్వాహకులు చిన్నయ్య, సర్పంచ్ పోతారెడ్డి మంగళవారం తెలిపారు.
![నేటి నుంచి పూసాయి ఎల్లమ్మ జాతర](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జైనథ్, జనవరి 12: మండలంలోని పూసాయి గ్రామంలో అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ(దుర్గామాత) ఆలయ ఆవరణలో బుధవారం నుంచి నెలరోజుల పాటు జాతర ప్రారంభం కానున్నట్లు గ్రామ కమిటీ నిర్వాహకులు చిన్నయ్య, సర్పంచ్ పోతారెడ్డి మంగళవారం తెలిపారు. పుష్యమాసం నుంచి మాగమాసం వరకు జరిగే ఈ జాతరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో మహిళలు హాజరై బోనాలు సమర్పిస్తారు.