పూలాజీ బాబా బాటలో నడవాలి

ABN , First Publish Date - 2021-03-15T05:09:55+05:30 IST

ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని ఎంపీపీ పోటే శోబాబాయి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిరం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు.

పూలాజీ బాబా బాటలో నడవాలి

ఇంద్రవెల్లి, మార్చి 14: ప్రతి ఒక్కరూ పూలాజీ బాబా సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని ఎంపీపీ పోటే శోబాబాయి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిరం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ హాజరై ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రతి ఒక్కరు వ్యసనాలకు దూరంగా ఉండి పూ లాజీ బాబా సూచించిన భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం ధ్యాన మందిర కమిటీ ఆధ్వ ర్యంలో భక్తులకు అన్నవితరణ చేశారు. ఈ  కార్యక్రమంలో ఆదివాసీ అంద్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాకురే రాందాస్‌, ఆదివాసీ ఆంద్‌ సంఘం జిల్లా  అధ్యక్షుడు ముఖడే విష్ణు,  పోటే సాయినాథ్‌, పుడంలిక్‌, బన్సీలాల్‌, డి. మాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-15T05:09:55+05:30 IST