ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి
ABN , First Publish Date - 2021-06-22T04:49:38+05:30 IST
పట్టణంలోని పోతు లూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రొఫె సర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు.
ఆసిఫాబాద్రూరల్, జూన్ 21: పట్టణంలోని పోతు లూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రొఫె సర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రధానకార్యదర్శి అశోక్, వర్కింగ్ప్రెసిడెంట్ సదాశివ్చారి,కోశాధికారి సురేష్చారి పాల్గొన్నారు. ఎస్టీయూభవన్లో ఎస్టీయూ ఉపాధ్యా యసంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్కు ఘనంగా నివాళులర్పించారు. నాయకులు మానిక్రావు, తుకారాం, జబ్బార్, సులేమాన్, భాస్కర్ పాల్గొన్నారు.