గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని వినతి
ABN , First Publish Date - 2021-02-07T04:25:14+05:30 IST
గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని శనివారం సేవాలాల్ సేన నాయకులు కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం అందజేశారు.

ఆసిఫాబాద్, ఫిబ్రవరి6: గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని శనివారం సేవాలాల్ సేన నాయకులు కలెక్టర్ రాహుల్రాజ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన ఏజెన్సీ ప్రాంతీయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ మాట్లాడుతూ ఏజేన్సీ గిరిజన చట్టాలైన 1/70, పేసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జీవో నం.3ను యథావిధిగా అమలు చేసి గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, నాయకులు భాస్కర్నాయక్, రూప్ల నాయక్, ఉత్తం నాయక్, ఇందులాల్, మత్రులాల్, రోహిదాస్ పాల్గొన్నారు.