నస్పూర్ అభివృద్ధికి పెద్దపీట
ABN , First Publish Date - 2021-06-24T04:49:45+05:30 IST
నస్పూర్ పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
- ఎమ్మెల్యే దివాకర్ రావు
నస్పూర్, జూన్ 23: నస్పూర్ పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మున్సిపాలిటీ లోని 11వ వార్డు కాకతీయ కాలనీలో రూ. 5 లక్షలతో సిమెంట్ రోడ్డు, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రూ. 1.18 కోట్లతో కల్వర్టు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైనా సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మురుగు నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వర్షం కురిస్తే వరద నీటితో ఇబ్బందులు ఎదురవుతున్నందున కల్వర్టును మంజూరు చేయించినట్లు తెలిపారు. తొందరగానే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాగా కాకతీయ కాలనీలో సీఎస్ఆర్ రూ. 5లక్షల నిధులతో నిర్మించే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేష్, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్ జాబిన్ బేగ్ అహ్మద్, టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు తిరుపతి, ఆయా వార్డుల కౌన్సిలర్లు పూదరి కుమార్, మహేష్, లక్ష్మి, నాసర్, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు విజిత్ రావు, కమాలాకర్ రావు, సురేందర్ రెడ్డి, కుమారస్వామి, కోటిలింగం, సుబ్బయ్య, ముక్కెర వెంకటేష్, ఎర్రయ్య పాల్గొన్నారు.