రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-05-06T04:33:12+05:30 IST

మండలంలోని కుచ్లాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారని తలమడుగు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... కుచ్లాపూర్‌ గ్రామానికి చెందిన వడ్గురేమహాదేవ్‌ (50) అనే వ్యక్తి ఉదయం కూరగాయలు తీసుకొని రైతుబజార్‌కు వెళ్తున్నాడు. ఎక్స్‌రోడ్డు వద్ద మహారాష్ట్ర నుంచి అతివేగంగా వస్తున్న ఐచర్‌ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శంకర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తలమడుగు, మే5: మండలంలోని కుచ్లాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారని తలమడుగు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... కుచ్లాపూర్‌ గ్రామానికి చెందిన వడ్గురేమహాదేవ్‌ (50) అనే వ్యక్తి ఉదయం కూరగాయలు తీసుకొని రైతుబజార్‌కు వెళ్తున్నాడు. ఎక్స్‌రోడ్డు వద్ద మహారాష్ట్ర నుంచి అతివేగంగా వస్తున్న ఐచర్‌ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శంకర్‌ తెలిపారు.


Updated Date - 2021-05-06T04:33:12+05:30 IST