వివాదాస్పద కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలించిన ఎంపీడీవో
ABN , First Publish Date - 2021-10-29T06:17:49+05:30 IST
మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన వివాదాస్పద కల్వర్టు నిర్మాణ స్థలాన్ని గురువారం ఎంపీడీవో క్రాంతి సందర్శించారు.

కడెం, అక్టోబరు 28 : మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన వివాదాస్పద కల్వర్టు నిర్మాణ స్థలాన్ని గురువారం ఎంపీడీవో క్రాంతి సందర్శించారు. బుధవారం సారంగాపూర్ గ్రామానికి సర్పంచ్ రాజిరెడ్డి కక్షతో తన భూమిలో కల్వర్టు ని ర్మాణం చేపట్టాలని చూడడమే కాకుండా తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని, అదే గ్రామానికి చెందిన యువ కుడు గులాం నబీ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన విధితమే. ఈ సంఘటనలో ఆ స్థలాన్ని పరిశీలించారు. స్థల వివరాలు, రికార్డులు పరిశీలించే వరకు పది రోజుల వరకు పనులు నిలిపి వేయాలని ఆదేశించారు. ఆమె వెంట కడెం ఎస్సై రాజు, ఎంపీవో ఎం. వెంకటేష్, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.