తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష: మంత్రి Indrakaran

ABN , First Publish Date - 2021-11-12T19:03:45+05:30 IST

ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష: మంత్రి Indrakaran

నిర్మల్: ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఓ వైపు వ‌రి ధాన్యం కొన‌మ‌ని కేంద్రం చెప్పుతుంటే, స్థానిక బీజేపీ నేత‌లు వ‌రి సాగు చేయాల‌ని రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారని మండిపడ్డారు. రాజ‌కీయాల కోసం అమాయకులైన అన్న‌దాత‌ల‌ను మోసం చేయ‌డం మానుకోవాలన్నారు. బీజేపీ నేత‌లకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి యాసంగి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసిన ధ‌ర్నాలకు రైతుల నుంచి స్పంద‌న లేదని, ఆ పార్టీ నేత‌ల మాట‌ల‌ను రైతులు న‌మ్మే ప‌రిస్థితి లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-11-12T19:03:45+05:30 IST