పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2021-06-22T04:20:41+05:30 IST
మంచిర్యాల పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాల్లో ఇండియ న్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్మహాజన్ పాల్గొని రక్తదానం చేశారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య, రూరల్ సీఐ కుమారస్వామి, మహిళ పోలీస్స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్కుమార్, దేవయ్య, హాజీపూర్ ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్సై నూనె శ్రీనివాస్, ఏఎస్సై వెంకన్నగౌడ్, మంచిర్యాల, సీసీసీ, నస్పూర్, హాజీపూర్ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.
ఏసీసీ, జూన్ 21: మంచిర్యాల పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాల్లో ఇండియ న్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్మహాజన్ పాల్గొని రక్తదానం చేశారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య, రూరల్ సీఐ కుమారస్వామి, మహిళ పోలీస్స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్కుమార్, దేవయ్య, హాజీపూర్ ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్సై నూనె శ్రీనివాస్, ఏఎస్సై వెంకన్నగౌడ్, మంచిర్యాల, సీసీసీ, నస్పూర్, హాజీపూర్ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వలు తగ్గాయని సొసైటీ సభ్యులు తెలిపిన వెంటనే శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి సంశయిస్తున్న తరుణంలో తలసేమియా, సికిల్సెల్, ఎనీమియా వ్యాధిగ్రస్తులకు, అత్యవసర రోగులకు రక్తం లభించడం లేద న్నారు. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పత్తి గట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పత్తి వెంకటేష్ ఆధ్వర్యంలో సభ్యులు రక్తదానం చేశారు. వారికి పట్టణ సీఐ ముత్తి లింగయ్య సర్టిఫికెట్లను అందజేశారు. రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, వైస్చైర్మన్ మహేందర్లు మాట్లాడుతూ పోలీసుల సేవలు మరువలేనివన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో 101 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి తరలించి భద్రపరిచినట్లు సభ్యుడు వి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.