రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
ABN , First Publish Date - 2021-03-04T05:23:35+05:30 IST
2020-21 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణ విష యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబబు అన్నారు.
అదనపు కలెక్టర్ రాంబాబు
ఆసిఫాబాద్, మార్చి3: 2020-21 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణ విష యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబబు అన్నారు. బుదవారం కలెక్టరేట్ భవనంలో ధాన్యం సేకరణ ముందస్తు చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల నివేదిక ప్రకారంగా ఈ సారి దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అదికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీ సంచులు, టార్పాలీన్లు అందుబాటులో ఉంచుకో వాలన్నారు. కొవిడ్ వైరస్ వ్యాప్తికి నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకో వాలన్నారు. శానిటైజర్ అందుబాటులో ఉంచా లని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైరస్ నియంత్రణ చర్యలు తప్పని సరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమా వేశంలో వ్యవసాయాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.