మార్కెట్ కమిటీ చెక్ పోస్టు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-27T04:00:42+05:30 IST
సిర్పూర్(టి) సరిహద్దులో మార్కెట్ కమిటీ చైక్ పోస్టును మంగళవారం జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ ప్రారంభించారు.
సిర్పూర్(టి), అక్టోబరు 26: సిర్పూర్(టి) సరిహద్దులో మార్కెట్ కమిటీ చైక్ పోస్టును మంగళవారం జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటు వైపు నుంచి వెళ్లె వాహనాలను చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని సూచించారు.ఎవరి కూడా వదిలి పెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణ, జిల్లా కో ఆప్షన్ సభుడు సిద్దిక్ అహ్మద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్ హుస్సేన్, ఉప సర్పంచ్ మహేష్, నాయకులు తుకారాం తదితరులు పాల్గొన్నారు.