సమాజ వికాసానికి సాహిత్యం దోహదపడాలి
ABN , First Publish Date - 2021-02-15T06:15:25+05:30 IST
సమాజ వికాసానికి సాహిత్యం దోహదపడాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపగాని రవీందర్ అన్నా రు. ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జరిగిన పుస్తకాల ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా మాట్లాడారు.
తెరవే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపగాని రవీందర్
ఉట్నూర్, ఫిబ్రవరి 14: సమాజ వికాసానికి సాహిత్యం దోహదపడాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపగాని రవీందర్ అన్నా రు. ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జరిగిన పుస్తకాల ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమాజంలో అనేకమైన దుస్సంఘటనలు జరుగుతు న్నాయని వీటిని యువత అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అభి ప్రాయ పడ్డారు. యువత సాహిత్యం దృష్టి సారిస్తే అప్పుడే ఆరోగ్యవం తమైన సమాజం నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. అందుకు గాలి రోహిత్ రచించిన జ్ఞానబోధ, కార్కురి మధుకర్ రచించిన తొలిమెట్టు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమానికి ఉసావే ప్రధాన కార్యదర్శి కొండగుర్ల లక్ష్మయ్య అధ్యక్షత వహించగా కార్యదర్శి కవన కోకిల జాదవ్ బంకట్లాల్, పూర్వ కార్యదర్శి మెస్రం మనోహర్, గౌరవ అధ్యక్షుడు భీమ్రావ్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతిరాం, కవులు కట్టా లక్ష్మణచారి, రాథోడ్ శ్రావణ్, ప్రిన్సి పాల్ మల్లారెడ్డి, కవయిత్రులు సుగుణ, లావణ్య, రచయితలు పాల్గొన్నారు.