నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ : కలెక్టర్
ABN , First Publish Date - 2021-03-01T05:41:50+05:30 IST
60 ఏళ్లకు పైబడినవారు, 45-59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1 సోమవారం నుంచి కొవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుందని
నిర్మల్ కల్చరల్, ఫిబ్రవరి 28: 60 ఏళ్లకు పైబడినవారు, 45-59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1 సోమవారం నుంచి కొవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రిలో టీకా ఇస్తారని, 45-59 ఏళ్ల లోపు వారు డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. టీకా తీసుకునే వారు కవిన్ యాప్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితకంగా టీకా ఇస్తారని, ప్రైవేట్లో రూ.250 చెల్లించాల్సి ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.