పశువుల మందపై రెండు పెద్ద పులుల దాడి
ABN , First Publish Date - 2021-02-26T13:20:32+05:30 IST
జిల్లాలో రెండు పెద్ద పులులు హల్చల్ చేశాయి. పశువుల మందపై ఒకేసారి రెండు పెద్ద పులులు దాడి చేశాయి.

కొమురం భీం: జిల్లాలో రెండు పెద్ద పులులు హల్చల్ చేశాయి. పశువుల మందపై ఒకేసారి రెండు పెద్ద పులులు దాడి చేశాయి. జిల్లాలో బెజ్జూరు మండలం కుంటల మానేపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు పశువులు గాయాలతో బయటపడ్డాయి. పశువుల కాపర్ల కేకలతో రెండు పులులు అడవిలోకి వెళ్లి పోయాయి. పులుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.