రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కేసీఆర్
ABN , First Publish Date - 2021-06-21T03:45:22+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడని, రైతు సంక్షేమం ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. తాళ్ళపేట, మ్యాదరిపేటలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేం ద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
దండేపల్లి,జూన్ 20: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడని, రైతు సంక్షేమం ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. తాళ్ళపేట, మ్యాదరిపేటలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేం ద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా అందుబాటులో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజీత్రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, సహకార సంఘం ఛైర్మన్ లింగన్న సర్పంచులు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రేణి శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అక్కల రవీందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్ పాల్గొన్నారు.