చెక్కుచెదరని వందేళ్ల నాటి వంతెన
ABN , First Publish Date - 2021-06-21T07:25:14+05:30 IST
మండల కేంద్రంలోని గోదావరి నదిపై వంతెన నిర్మించి వంద సంవత్సరాలు పూర్తయినా ఇంకా చెక్కు చెదరలేదు. గతంలో నిమ్మనాయుడు కాలంలో వంతెనను నిర్మించారు. వంతెన నిర్మాణం నాణ్యతగా జరగడంతో ఇప్పటికి ద్విచక్రవాహన దారులు, కాలిబాటన నడిచే వారు వంతె
నిమ్మనాయుడి కాలంలో సోన్ వంతెన నిర్మాణం
60 అడుగుల ఎత్తు, 6 మీటర్ల వెడల్పు, 915 మీ. పొడవు, 30 స్తంభాలతో నిర్మాణం
పర్యాటకులకు ఆకర్షణగా నిలుస్తున్న వైనం
గడువు ముగిసిపోవడంతో పక్కనే కొత్త వంతెన నిర్మాణం
సోన్, జూన్ 20: మండల కేంద్రంలోని గోదావరి నదిపై వంతెన నిర్మించి వంద సంవత్సరాలు పూర్తయినా ఇంకా చెక్కు చెదరలేదు. గతంలో నిమ్మనాయుడు కాలంలో వంతెనను నిర్మించారు. వంతెన నిర్మాణం నాణ్యతగా జరగడంతో ఇప్పటికి ద్విచక్రవాహన దారులు, కాలిబాటన నడిచే వారు వంతెన నుండి రాకపోకలు కొనసాగిస్తు న్నారు. నిర్మల్-నిజామాబాద్ సరిహద్దులను కలుపుతూ వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. వంతెన నిర్మించి వంద సంవత్సరాలు పూర్తికాగా, 60 అడుగుల ఎత్తు, 6 మీటర్ల వెడల్పు, 915 మీటర్ల పొడవు, 30 స్తంభాలు పెట్టి నిర్మించారు. పాత వంతెన గడువు ముగిసిపోవడంతో కొత్తగా నిర్మించా రు. అంతేకాకుండా ప్రస్తుతం పాత వంతెన వద్ద పర్యా టకుల సందడి ఉంటుంది. వంతెన సినిమా షూటింగ్, షార్ట్ ఫిలింల నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. ఏదిఏమైనా సోన్ వంతెన నిర్మించి వంద సంవత్సరాలు పూర్తయినా చెక్కు చెదరకుండా ఉండటం అప్పటి నాణ్యతతో కూడిన నిర్మాణపు పనులకు నిదర్శంగా చెప్పుకోవచ్చు.