జీవో 317తో నిరుద్యోగులకు అన్యాయం
ABN , First Publish Date - 2021-12-31T03:49:35+05:30 IST
నిరుద్యోగులకు జీవో నం.317తో అన్యాయం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు వివ్వప్రసాద్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్లో ఓయూ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అనీల్కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాగర్జన సభను నిర్వహించారు.
![జీవో 317తో నిరుద్యోగులకు అన్యాయం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123010182340/12302021221924n44.jpg)
- డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు
ఆసిఫాబాద్రూరల్, డిసెంబరు 30: నిరుద్యోగులకు జీవో నం.317తో అన్యాయం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు వివ్వప్రసాద్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్లో ఓయూ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అనీల్కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాగర్జన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నం.317 వల్ల స్థానిక నిరుద్యోగులకు జరుగుతున్న అన్యా యాన్ని ఖండించారు. జిల్లా ఉద్యోగాలు మాకే కేటాయించాలని, వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అనిల్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లాంటి మరో ఉద్యమానికి నాంది పలకాల్సి ఉంద న్నారు. కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, నాయకులు వసంత్ రావు, రమేష్, జీవన్, జమీర్, కళావతి, రాజ్కుమార్ పాల్గొన్నారు.