ఉట్నూర్లో హైపోక్లోరైడ్ పిచికారీ
ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST
మండలంలో రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నందున గ్రామ పంచాయితీ అధికారులు ఆదివారం హైపోక్లోరైడ్ స్ర్పే నిర్వహించారు.
ఉట్నూర్రూరల్, మే 9: మండలంలో రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నందున గ్రామ పంచాయితీ అధికారులు ఆదివారం హైపోక్లోరైడ్ స్ర్పే నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పట్టణంలోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్ఠి సారించామని ఇన్చార్జి ఈవో ఉప్పుల సత్యనారాయణ తెలిపారు. ఆయన వెంట బిల్కలెక్టర్ ఎలమల మనోహర్ తదితరులు ఉన్నారు.